కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం
అమరావతి: కర్ణాటకలో ఎట్టకేలకు రాష్ర్ట 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేశారు.. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సీ.ఎంగా సిద్ధరామయ్య,,డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ల చేత ప్రమాణస్వీకారం చేశారు..బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితరులు హాజరయ్యారు..ప్రమాణ స్వీకారం సమయంలో,పార్టీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు లో,లోపల రగిలిపోతున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాలం స్థిరంగా పాలన సాగిస్తుంది అనేది వేచి చూడాల్సిందే..?