AMARAVATHINATIONAL

మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నాన నైరుతి రుతుపవనాలు-ఐఎండీ

అమరావతి: నేటితో రోహిహి కారై ముగిసింది..రేపటి నుంచి మృగశిర కార్తె మొదలు అవుతుంది.. రోహిణి కారై 13 రోజుల పాటు ప్రజలకు మండెఎండల రూపంలో నరకం చూపించింది….ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది..ఆటు పిమ్మట క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నయని తెలిపింది..ప్రస్తుతం అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..2023 జూన్ 4న రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయని మే నెలలో ఐఎండీ అంచనా వేసింది..

ఐఎండీ  విడుదల చేసిన బుల్లెటన్ సారాంశం……” దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి.. అవి క్రమంగా బలపడుతున్నాయి…ఇదే సమయంలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది…ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి…మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది ” అని పేర్కొంది..

కేరళ,,తమిళనాడు,,లక్షదీప్,,కర్ణాటక,,ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *