జూన్ 4న కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతు పవనాలు
అమరావతి: ఇప్పటికే అండమాన్ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతు పవనాలు జూన్ 4వ తేదీ నాటికి కేరళ తీరంను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది..కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు రావటానికి సమయం పడుతుందని తెలిపింది..గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన వాతావరణ శాఖ నివేదికలో ఈ విషయాన్ని తెలియచేసింది.. రుతుపవనాలు కేరళలో జూన్ 4వ తేదీ నాటికి ప్రవేశిస్తుండగా,,నాలుగు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని,,రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది..నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది..వాతావరణం అనుకూలిస్తే, జూన్ 16వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది..జూన్ 1వ తేది నాటికే కేరళలోకి నైరుతి రుతు పవనాలు రావాల్సి ఉంది..ఇటీవల సముద్రంలో ఏర్పడిన ఆల్పపీడనాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది.