DISTRICTS

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలో ఉన్న స్క్రాప్ సామాగ్రిని టెండర్లు పిలిచి ఈ నెలాఖరులోగా విక్రయించాలన్నారు. అవసరమైన పరికరాలకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సీసీ కెమెరాలు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కు నూతన అగ్రిమెంట్లు తయారుచేసి సంబంధిత ఏజెన్సీలను నియమించాలన్నారు. రోగులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలను సకాలంలో సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్ సిద్ధానాయక్, AP MSIDC EE విజయ భాస్కర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ,, డాక్టర్ గీతా లక్ష్మి, కమిటీ కోఆర్డినేటర్ సునంద లక్ష్మి, సభ్యులు అభిషేక్, శ్రీనివాసులురెడ్డి, వీరభద్రారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *