నెల్లూరు: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల పార్కులో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్థానిక చిల్డ్రన్స్ పార్కులో జరుగుతున్న పనులను కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని చిన్న పిల్లల ఆటవిడుపు వస్తువులు, వివిధ రకాల ప్లే గ్రౌండ్స్, పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు, వాకింగ్ ట్రాక్, వ్యాయమ ఉపకరణాలు, స్విమ్మింగ్ పూల్, మంచి నీటి సౌకర్యాలు, బెంచ్ ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, సెక్యూరిటీ విభాగం, తినుబండారాల షాపులు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పార్కులోని సందర్శకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి అవసరమైన సదుపాయాల గురించి విచారించారు. ప్రజలు పార్కును ప్రతిరోజూ సందర్శించి ఆటవిడుపు పొందేలా అన్ని వసతులను కల్పించనున్నామని, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులో తెనున్నామని కమిషనర్ వెల్లడించారు.
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
This website uses cookies.