AMARAVATHI

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను వేస్తే కఠిన చర్యలు-M.H.O Dr. వెంకట రమణ

నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడంతో పశువులు, కుక్కలు, పందులకు ఆయా ప్రాంతాలు ఆవాసంగా మారడంతో పాటు దోమల వ్యాప్తికి ప్రధాన కారణమవుతుందనీ, పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతాయని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ తెలిపారు.. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఇరుగాళమ్మ దేవస్థానం నుంచి జొన్నవాడకు పోయే ప్రధాన మార్గం వెంబడి డంప్ చేసి ఉన్న వ్యర్ధాలను గురువారం అయన పరిశీలించారు.. వ్యర్ధాలను డంప్ చేస్తున్న వారిని, వాహనాలను గుర్తించాలని సచివాలయ శానిటేషన్ కార్యదర్శులకు సూచించారు..అనంతరం స్థానిక 14వ డివిజన్ బాలాజీ నగర్, గౌడ హాస్టల్ సెంటర్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైను కాలువల పూడికతీత పనులను అయన పరిశీలించారు.. అన్ని డివిజనుల్లో కాలువల పూడికతీత, దోమల నివారణా చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని తెలిపారు.. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.. అదేవిధంగా అన్ని వ్యాపార వాణిజ్య కేంద్రాలు, షాపులు, వీధి దుకాణాలు, రోడ్డు మార్జిన్ వర్తకులు, పూల అంగళ్ల నిర్వాహకులు, మార్కెట్ కేంద్రాల్లోని షాపుల్లో తప్పనిసరిగా డస్ట్ బిన్లను ఏర్పాటు చేసి వినియోగించేలా సూచికలు ఏర్పాట్లు చేయాలని కోరారు.. అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డస్ట్ బిన్ల ఏర్పాటుతో పాటు, నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై భారీ జరిమానాలు విధిస్తామని డాక్టర్ హెచ్చరించారు.

Spread the love
venkat seelam

Recent Posts

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

1 hour ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

2 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

2 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

3 hours ago

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

24 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

1 day ago

This website uses cookies.