సూపర్ ఫాస్ట్ ఎక్స్ కోరమండల్ రైలుకు భారీ ప్రమాదం
ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నంబర్ 06782262286,,Helpline 03322143526
అమరావతి: తమిళనాడు నుంచి బయలుదేరే (12841) సూపర్ ఫాస్ట్ ఎక్స్ కోరమండల్ రైలుకు భారీ ప్రమాదం జరిగింది. నేడు(శుక్రవారం)సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి..ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది..100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కోరమండల్ రైలు, గూడ్స్ రైలును ఢీకొనటంతో 3 స్లీపర్ కోచ్ లు తప్ప మిగిలిన అన్ని బోగీలు పట్టాలు తప్పాయి.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడు బోగీలు ఒకటికి ఒకటి ఢీకొని భారీగా దెబ్బతిన్నాయి..ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు..100 మందికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రైల్వే అత్యవసర విభాగాలు సంఘటన స్థలంకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి..ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది..కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్ కతా వెళుతుంది..ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది..మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు వెల్లడించారు..
Visuals from a nearby district hospital where the injured have been taken to. pic.twitter.com/jVPlZreR0C
— Press Trust of India (@PTI_News) June 2, 2023