NATIONAL

ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఇంటీరియం బెయిల్

అమరావతి: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో సుప్రీంకోర్టు శుక్రవారం ఇంటీరియం బెయిల్ మంజూరు చేసింది..గత సంవత్సరం మే నెలలో మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన జైన్,,తిహార్ జైలులో ఉన్నారు.. గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో బాత్‌రూంలో పడిపోయారు. దీంతో జైన్‌ను గదికి తరలించి జైలు వైద్యులు పరిశీలించారు..వారి సూచన మేరకు తొలుత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు.. వైద్య పరీక్షల అనంతరం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ (LNJP) ఆస్పత్రిలో చేర్చారు..అక్కడ ఆయన ఐసీయూలో ఆక్సిజన్‌ మద్దతుతో చికిత్స పొందుతున్నారు. జైన్ గత సంవత్సరం నుంచి తిహార్ జైలులోని సెల్‌ నం.7లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉంటున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *