AMARAVATHIHYDERABADPOLITICS

నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తన చర్యలను వేగవంతం చేసినట్లు తాజా చర్యలను చూస్తే ఆర్దమౌతుంది..శుక్రవారం అధికారుల బదిలీ ప్రక్రియపై సర్క్యులర్ జారీ చేసిన ఈసీ,,శనివారం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణకు సంబంధించిన మరో సర్క్యులర్ ను విడుదల చేసింది..ఈ నెల 5వ తేదీ నుంచి 10 వ తారీఖు వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది..ప్రస్తుతం తెలంగాణలో 2.99 కోట్ల మంది ఓటర్లు ఉండగా,,ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది..రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 మంది ట్రైనర్స్ కు శిక్షణ ఇస్తారు..వీళ్లు కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది..ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి..? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి.. ఇంకా ఎన్ని కావాలి..? అనే అంశాలపైనా ఈసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నార.. ఈసీ చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చని,,నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచన వేస్తున్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *