CRIMENATIONAL

మహిళా కానిస్టేబుల్ పై కత్తితో దాడి

అమరావతి: మద్యం మత్తులో తాగుబోతులు విచక్షణ రహితంగా ప్రవర్తస్తారు అనేందుకు అనేక ఉదాహరణలు వున్నాయి..ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చెన్నై బీచ్‌ నుంచి చెంగల్‌పేట వెళ్లే సబర్బన్‌ రైలు స్టేషన్ నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది..ఇంతలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి మహిళా ప్రయాణికుల కోసం కేటాయించిన బోగీలోకి ఎక్కడు.ఇది మహిళకు సంబంధించిన కంపార్ట్‌మెంట్ అని దిగమని అక్కడ విధులు నిర్వహిస్తున్న RPF కోరింది..దీంతో కోపంతో ఊగిపోయిన దుండగుడు అతని వద్ద వున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు.అందులో ఉన్న మహిళ ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి తప్పించుకున్నాడు.బోగీలోని ప్రయాణికులు జరిగిన విషయం RPF సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సహాయంతో మహిళా కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు.అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి,నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *