నెల్లూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు “రివర్ ఫ్రంట్ డెవెలెప్మెంట్” కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలోని స్వర్ణాల చెరువు అభివృద్ధికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మనేజ్మెంట్ లిమిటెడ్ (APUIAML) చీఫ్ ఆర్కిటెక్ట్ కిరణ్ కుమార్, కమిషనర్ వికాస్ మర్మత్,లు అధికారులకు సూచించారు. స్థానిక స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్ తీర ప్రాంతంలో ఏ. APUIAML, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వారు శుక్రవారం పర్యటించారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి నడక మార్గం, ప్రహరీ గోడల నిర్మాణం, వ్యర్ధాల నుంచి తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, గజేబో, మోరల్ ఆర్ట్స్ తదితర నిర్మాణాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, డి.ఈ చంద్రయ్య, ఏ.ఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.