చుక్కల భూముల రైతులకు జి.వోల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు-జనసేన
నెల్లూరు: ప్రభుత్వాలు మట్టిని నమ్మి కష్టం చేసే రైతన్న పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేందుకు సజీవ ఉదాహరణ చుక్కల భూములే అని జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జీ నలిశెట్టి.శ్రీధర్ అన్నారు.సోమవారం జనసేన నెల్లూరు జిల్లా నాయకులతో కలసి,చుక్కల భూములపై ప్రభుత్వం ఇచ్చిన జి.వో నెం 163ను యథాతధంగా అమలు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.