AMARAVATHI

ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది-అంబటి

నెల్లూరు: అన్ని వర్గాలతో పాటు కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని,సీ.ఎం  జగన్మోహన్ రెడ్డి కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో రూ. 6.15 కోట్లతో నూతనంగా నిర్మించిన కాపు భవన్ ను మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన కాపు భవనానికి తమ ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రారంభించడం తమ  అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమని, దక్షిణ భారతదేశంలో కాపు సామాజిక వర్గం బాగా విస్తరించిందని, ఈ సామాజిక వర్గం సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎం.పీ ఆదాల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ ఈ భవన నిర్మాణానికి రూ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ భవనం అందరికీ ఉపయోగపడేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో కాపు కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

3 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

3 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

5 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

5 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

23 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.