NATIONAL

ఢిల్లీపై పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు

అమరావతి: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది..ఢిల్లీపై పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది..ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉండాలని,, ఎల్జీ చేతుల్లో కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది..ప్రభుత్వాధికారులపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండాలని,,లేదంటే తమను ఎవరూ ఎమిచేయలేరన్న భావన అధికారుల్లో పెరుగుతుందని పేర్కొంది..దింతో జవాబుదారీతనం లేకుండా పోతుందని అభిప్రాయపడింది.. నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ-ఢిల్లీ (ఢిల్లీ ప్రభుత్వం) మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వం మాదిరిగానే భావించాలని సుప్రీం స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం స్పష్టం చేసింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *