కర్ణాటకలో రేపు ఉదయం ప్రారంభం కానున్ను ఓటర్ల తీర్పు
అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వసిద్దమైంది..బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు..ప్రధాన పోటీ ముడు పార్టీలు అయిన BJP,,CONG,,JDS మధ్యే నెలకొంది..మొత్తం 2,615 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు..224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది..ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది..గడిచిన 38 సంవత్సరాల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి రెండసారి అధికారంలోకి రాలేదు..అయితే ఉత్తరప్రదేశ్ లో లాగా కర్ణాటకలో కూడా రెండవసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది..ఇందులో భాగంగా ప్రధాని మోదీ కర్ణాటక ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు..రెండవ సారి బీజేపీకి అధికారం ఎందుకు ఇవ్వాలలో తెలియ చేస్తసూ,,,పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్నోవేషన్లో కర్ణాటకను అగ్రస్థానంలో నిలపాలన్నది తమ ఆకాంక్ష అని కన్నడ ఓటర్లకు ప్రధాని విజ్ఞప్తి చేశారు..విద్యా, ఉద్యోగాలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలోనూ మొదటి స్థానంలో కర్ణాటక నిలుపుతామన్నారు.