AMARAVATHI

ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుంది-డాక్టర్ పి.వి.రమేష్

నెల్లూరు: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుందని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు..ఆదివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి 13వ వర్ధంతి సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఎవరి ఆరోగ్యం వారే చూసుకోవడం ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న మనలాంటి దేశాల్లో సాధ్యం కాదన్నారు..వ్యాధులకు వైద్యం చేయించడమే కాకుండా వ్యాధులు రాకుండా తీసుకొనే నివారణ చర్యలు కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు..కొత్త కొత్త స్కీములు ప్రవేశపెట్టడంతోనే ప్రజలందరికీ వైద్యం అందదని, వైద్యానికి అయ్యే ఖర్చులను రోగాలతో బాధపడుతున్న పేదవారికి సాధ్యం కాదన్నారు..ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు  పెంచడంతోపాటు ఆరోగ్య వ్యవస్థను, వైద్య విద్యను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..ఈ సదస్సులో చండ్ర.రాజగోపాల్, ఆర్.నగేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నవకోటేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం, రాము, మెడికల్..అధ్యక్షులు మధు, ఎ.పి మెడికల్…గౌరవ అధ్యక్షులు సతీష్, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డా. బి రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రెసిడెంట్  డాక్టర్ ఎం.వి.రమణయ్య, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

18 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

20 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

24 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.