AMARAVATHICRIME

రోడ్డు ప్రమాదంకు గురైన ట్రావెల్స్ బస్సు-డ్రైవర్ తో సహ 10 మందికి గాయాలు

నెల్లూరు: నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పరిధిలోని నాయుడుపాళెం హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..నాయుడుపాళెంకు చెందిన గ్రామస్తుడు,,గొర్రెలను మేపుకునేందుకు,హైవే రోడ్డు దాటిస్తున్న సమయంలో నెల్లూరు వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢీ కొని, అపకుండా వెళ్లిపోయింది..వాహనం ఢీ కొనడంతో దాదాపు 5 గొర్రెలు రోడ్డుపైన పడిపోయాయి..ఇదే సమయంలో నెల్లూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా పడివున్న గొర్రెలను ప్రక్కకు లాగి వేసేందుకు,లారీని రోడ్డుపైన ఆపాడు..అదే సమయంలో 36 మంది ప్రయాణికులతో కాకినాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న బిగ్ బాస్ ట్రావెల్స్ కు చెందిన బస్సు,,ముందు అగి వున్న లారీని అదుపు తప్పి వేగంగా ఢీ కొన్నది.. ప్రమాదంలో డ్రైవర్ తో సహా 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి..స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు,108 సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *