అమరావతి: టర్కీలో సోమవారం వేకువజామున భారీ భూకంపం సంభవించింది..రిక్టర్ స్కేల్ పై దిని తీవ్రత 7.6,,7.8గా రెండు సార్లు నమోదైంది..భూకంపం ధాటికి దాదాపు 1600 మందికిపైగా మరణించి వుంటారని అధికారులు భావిస్తుండగా,,ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు..వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోసారి భూమి కంపించింది..దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు..దక్షిణ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రావిన్స్ లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.. డమాస్కస్, లటాకియా ఇతర సిరియన్ ప్రావిన్సుల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది..భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన టర్కీకి తక్షణమే సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాన మంత్రి మోదీ అదేశించారు..దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది..ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా, టర్కీకి తక్షణ సహాయ చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు..కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ, NDMA, NDRF, రక్షణ, విదేశాంగ శాఖ, పౌర విమానయాన, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. NDRF, భారత వైద్య బృందాలు అత్యవసర సహాయక చర్యల కోసం రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వెళ్లనున్నారు..అలాగే సహాయక సామాగ్రి, మందులు పంపనున్నారు..ఇక ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, 100 మంది NDRF సిబ్బంది సైతం టర్కీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు..భారత వైద్య బృందాలు అవసరమైన మందులతో టర్కీ వెళ్లనున్నాయి..టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారాలోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.