DISTRICTS

ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యంకు డబ్బు తీసుకొవడం ఏమిటి-కలెక్టర్

 నెల్లూరు: జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులకు మానవత్వంతో చికిత్స అందించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఇకపై రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు సంబంధిత ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు.శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ  సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ పథకం అమలు, వైద్య సేవల తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రోగుల నుంచి 193 ఫిర్యాదులు అందాయని, అందులో 57 కేసులకు సంబంధించి వైద్య చికిత్సల కోసం తీసుకున్న నగదు తిరిగి సంబంధిత రోగులకు చెల్లించారన్నారు. ఇంకా 21 కేసులకు సంబంధించి నగదు చెల్లించాల్సి ఉందన్నారు. మరో 64 కేసులు తప్పుడు కేసులుగా నిర్ధారించడం జరిగిందని, 51 కేసులు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అసలు వైద్యం ఉచితంగా అందించాలని అటువంటిది రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం సరైనది కాదని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 21 కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా కొత్తగా మరో 809 వైద్య సేవలు కలిశాయని వాటికి సంబంధించి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వైద్య చికిత్సల కోసం తిరుపతి, చెన్నైకు రెఫర్ చేసే ముందు సంబంధిత ఆసుపత్రులతో మాట్లాడి రోగి ఆరోగ్య పరిస్థితులను కూడా వారికి తెలియజేయాలని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

10 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

11 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

12 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

13 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.