INTERNATIONAL

ఆకస్మికంగా ఉక్రెయిన్ లో పర్యాటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమరావతి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల స్మారకం చిహ్నం వద్ద నివాళులర్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై సంవత్సరం అయిన నేపథ్యంలో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది..సోమవారం పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డుడాతో సమావేశమయ్యేందుకు వెళ్తూ మార్గం మధ్యలో కీవ్లో దిగారు.. సోమవారం ఉదయం ఉక్రేయిన్ రాజధాని కీవ్ తో సహా దేశవ్యాప్తంగా అధికారులు ఎయిర్ అలర్ట్ జారీ చేశారు.. తన పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ పలు అంశాలపై చర్చలు జరిపారు.  దాదాపు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్కు అందజేయనున్నట్లు బైడెన్ తెలిపారు. 

రష్యా పెద్ద తప్పు చేసింది:-  రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో ఉక్రెయిన్ బలహీనమైందని,,ఉక్రెయిన్ పై రష్యా ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు…ఆ తరువాతే అందరికి అర్థమైంది…రష్యా పెద్ద తప్పు చేసిందని…రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై సంవత్సరం అయింది…అట్లాంటిక్, పసిఫిక్ పరిధిలోని అన్ని దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి… ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వహభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల అమెరికా తిరుగులేని నిబద్ధతను చూపుతోందని బైడెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *