AMARAVATHIDISTRICTS

రాబోయే 10 రోజుల్లో రైతులకు పరిహారం చెల్లింపు పూర్తి చేస్తాం-కలెక్టర్

నెల్లూరు: జాతీయ రహదారుల భూ సేకరణ వేగవంతం చేస్తూ రైతులకు పరిహారం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి వివరించారు. గత రెండు రోజుల్లో భూ సేకరణ పరిహారం క్రింద రైతులకు ఐదు కోట్లు చెల్లించామని ,రాబోయే పది రోజుల్లో పరిహారం చెల్లింపు పూర్తి చేస్తామని కలెక్టర్ సీ.ఎస్. కు. వివరించారు.ఇటీవల ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా పర్యటనకు వచ్చి సమీక్ష చేశారని కలెక్టర్ తెలిపారు.అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన  కార్యదర్శులు పలు అభివృద్ది అంశాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నెల్లూరు నుండి జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎం.కూర్మనాధ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్లు విద్యాదరి, సంజన సీన్హా జిల్లా అధికారులు పాల్గొన్నారు..వీడియో కాన్ఫరెన్స్ లో సి ఎస్. జవహార్ రెడ్డి రాష్ట్రం లోని అన్ని జిల్లాల కలక్టర్లతో మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో కూలీలు ఎక్కువగా  పాల్గొని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి దిశ చట్టం కమిటీ సమావేశాలు త్వరగా నిర్వహించాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *