NATIONAL

ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు-సుప్రీం

అమరావతి: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రింకోర్టు తిరస్కరించింది.. గురువారం న్యాయవాది సిఆర్ జయ‌సుకిన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై శుక్రవారం వేకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జెకె మహేశ్వరి,, పీఎస్ నరసింహలు విచారించారణ జరిపేందుకు విముఖత వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ,, మీరు ఇలాంటి పిటిషన్‌లతో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు..ఆర్టికల్ 32 ప్రకారం దానిని స్వీకరించడానికి మాకు ఆసక్తి లేదని జస్టిస్ నరసింహ అన్నారు..ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు అని పిటిషనర్‌ను సుప్రింకోర్టు ప్రశ్నించింది..ఈ విషయమై న్యాయమూర్తులు మాట్లాడుతూ,, మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు..ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు.. ఎగ్జిక్యుటివ్ హెడ్ (ప్రధాని) పార్లమెంట్ సభ్యుడు అని సుప్రీంకోర్టు పేర్కొంది.. రాజ్యాంగ అధిపతి (అధ్యక్షుడు) పార్లమెంట్‌లో భాగం..పిటిషన్‌ను కొట్టివేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది..అనంతరం పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాది అనుమతి కోరాగా అందుకు న్యాయమూర్తి పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *