అమరావతి: జై జవాన్ జై కిసాన్ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలించిన, భారత మాజీ ప్రధాని, భారతరత్న..లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు..అక్టోబర్ 2వ తేది 1904వ సంవత్సరంలో మొగల్సరాయ్లో శారద ప్రసాద్ శ్రీవాస్తవ,, రామదులారిదేవి దంపతులకు జన్మించారు..ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇంటర్ కాలేజ్,,హరీష్ చంద్ర హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అనిబెసెంట్ గురించి చదవడం ద్వారా శాస్త్రి ఆలోచనలు ప్రభావితమయ్యాయి. గాంధీ ప్రసంగాలతో ప్రభావితమైన శాస్త్రి 1920 లలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.. 1947లో స్వాతంత్ర్యం తరువాత, లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి నెహ్రూ మంత్రివర్గ బాధ్యతలు తీసుకున్నారు.. మొదట రైల్వే మంత్రిగా (1951-56), ఆటు తరువాత హోం మంత్రితో సహా అనేక ఇతర బాధ్యతలను నిర్వర్తించారు.. ప్రధానమంత్రిగా బాద్యతలు చేపట్టిన తరువాత దేశ హితం కోసం పలు సంస్కరణలు చేపట్టారు.. భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి శాస్త్రి 1965లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ఎంతగానో ప్రోత్సహించారు..ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా పంజాబ్, హర్యానా,, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుదలకు దారితీసింది.. శాస్ర్రి రెండవ భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో దేశానికి నాయకత్వం వహించాడు ..అ సమయంలో ” జై జవాన్, జై కిసాన్” (“సైనికునికి నమస్కారం; రైతుకు నమస్కారం”) అనే నినాదంలో యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది.. యుద్ధం అధికారికంగా 10 జనవరి 1966న తాష్కెంట్ ప్రకటనతో ముగిసింది..కొన్ని కుట్రల కారణంగా? మరుసటి రోజు శాస్త్రి రష్యాలో మరణించాడు?..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.