AMARAVATHI

ఎన్డీఏలో కూటమిలో చేరతానని సీఎం కేసీఆర్ మా వెంట పడ్డాడు-ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎన్డీఏలో కూటమిలో చేరతానని సీఎం కేసీఆర్ మా వెంట పడ్డాడు కానీ కేసీఆర్ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచనల నిజాలు బయటపెట్టారు..మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్బంలో ఏర్పాటు చేసిన జనగర్ఝన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ,, తెలంగాణలో ఒక కుటుంబం పాలన సాగుతొందని,,ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందన్నారు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్, ఆయన కుమారుడు,, ఆయన కుమార్తె,, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ఆరోపించారు..కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోందని,, అలాంటి కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వవద్దని కోరారు.. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదన్నారు..కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ప్రవర్తించి,,ఆర్భాటంగా స్వాగతం పలికాడని,,ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయిందని అన్నారు.. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదన్నారు..I.N.D.I.A కూటమి వీరిని రానీవ్వక పోవడంతో మళ్లీ కేసీఆర్ నా దగ్గరికి వచ్చి,,తన కొడుకును ఆశీర్వదించమని అడిగాడని,, ఇందుకు నేను నిరాకరించడంతో నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి భయ పడుతున్నాడని వెల్లడించారు..కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదన్నారు..బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో తెరచాటు ఒప్పందాలు వున్నాయన్నారు..కర్ణాటకలో కాంగ్రెస్,,బీఆర్ఎస్ కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయని తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

12 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

14 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

17 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

18 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

21 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.