నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల నిర్వహణల్లో క్రమశిక్షణ పాటించాలని కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. స్థానిక 28/1 జెడ్పీ కాలనీ, 28/2 న్యూ మిలటరీ కాలనీ 1, 28/3 న్యూ మిలటరీ కాలనీ 2 వార్డు సచివాలయాలను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని నోటీసు బోర్డు, హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంభందించిన ఆస్థి పన్ను ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ అంశాన్ని పన్ను చెల్లింపుదారులకు అవగాహన పెంచాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కమిషనర్ సూచించారు. సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వేసవికాలపు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించాలని కమిషనర్ ఆదేశించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.