AMARAVATHI

10వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత-మంత్రి బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు..శనివారం విజయవాడలోని SSC బోర్డు కార్యాలయంలో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి బొత్సా 2022-2023 ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు..ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలికలదే పైచేయి అన్నారు..ఉత్తీర్ణత సాధించిన జిల్లాలో టాప్ లో పార్వతి పురం మన్యం జిల్లా ఉండగా చివరిస్థానంలో నంద్యాల జిల్లా ఉందని తెలిపారు..ఉత్తీర్ణతలో బాలురు 69.27 శాతం ఉండగా బాలికలు 75.38 శాతం మంది ఉన్నారని వెల్లడించారు..బాలురు కంటే బాలికలు 6.11 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి బొత్సా అభినందనలు తెలిపారు..

జూన్ 2 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు..మొత్తం 933 పాఠశాలల్లో  100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు..ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగిన 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807మంది ఉన్నారన్నారు..

జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని,,సప్లిమెంటరీ పరీక్షలకు May 17వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు..రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు  మే 13 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in లో చూడవచ్చు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

16 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

17 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

18 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

20 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

21 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.