అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్లాండ్ సైన్యం 3 యుద్ధనౌకలు,,2 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు నావికాదళం సోషల మీడియా ద్వారా వెల్లడించింది.. HTMS సుఖోథాయ్ యుద్ధ నౌక ఇంజిన్ పనిచేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.. వాతావరణం అనుకూలించకపోవడంతో నౌకలో ఉన్న 106మందిలో 73 మంది లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఉండగా,,33 మంది తప్పిపోయారు. నౌకాదళం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది..1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ ఆదివారం బలమైన అలల తాకిడికి గురైంది..సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది ఒక వైపుకు వంగిపోయిందని ప్రమాదం జరిగిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్క్రాంగ్ మాంథార్డ్పలిన్ తెలిపారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.