నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఓటర్లంతా తమ హక్కును సద్వినియోగ పర్చుకోవాలని A.E.R.O.సిటీ ప్లానర్ దేవీకుమారీ కోరారు. ఓటరు నమోదు అవగాహన కోసం 10 ప్రచార వాహనాలు, బైక్ ర్యాలీ ద్వారా మంగళవారం వి.ఆర్ కళాశాల మైదానం నుంచి ఏ.ఈ.ఆర్.ఓ జెండా ఊపి ప్రారంభించారు.గాంధీ బొమ్మ, కనకమహల్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్, సుబేదార్ పేట రోడ్డు, సంత పేట, పాత మున్సిపల్ ఆఫీసు రోడ్డు, ఇరుగాళమ్మ దేవస్థానం కూడలి, డి.కె. మహిళా కళాశాల, బారా షహీద్ దర్గా, నగర పాలక సంస్థల మీదుగా సాగిన ఈ బైక్ ర్యాలీలో నగర పాలక సంస్థ సిబ్బంది, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ-117 ఓటరు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ప్రచార వాహనాలతో ఓటరు నమోదుపై చైతన్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 70 ప్రచార వాహనాలతో పాటు ఓటరు అవగాహనా క్యాంపులను నగర వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ప్లానింగ్ సిబ్బంది,సూపర్ వైజర్లు, బి.ఎల్.ఓ లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.