బస్సులు బయలుదేరు వివరాలు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 255 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. జిల్లాలోని వివిధ బస్టాండ్ల నుండి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లనున్న పోలింగ్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు లేకుండా సులభంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అన్ని మార్గాల్లో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 12వ తేదీ ఉదయం 6 గంటలకు సంబంధిత బస్టాండ్ల నుండి బస్సులు బయలుదేరతాయని, అదేవిధంగా 13వ తేదీ రాత్రి 10.30, 11.30, 12.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయని చెప్పారు.
బస్సులు బయలుదేరు వివరాలు:-
నెల్లూరు మెయిన్ బస్టాండు నుండి కందుకూరుకు 19 బస్సులు, కావలికి 23 బస్సులు, ఆత్మకూరుకు 18 బస్సులు, ఉదయగిరికి 27 బస్సులు, సర్వేపల్లికి 16 బస్సులు బయలుదేరుతాయి.
కావలి మెయిన్ బస్స్టేషన్ నుంచి కందుకూరుకు 4 బస్సులు, ఆత్మకూరుకు 8 బస్సులు, కోవూరుకు 5 బస్సులు, నెల్లూరుకు 9 బస్సులు, సర్వేపల్లికి 5 బస్సులు, ఉదయగిరికి 5 బస్సులు బయలుదేరుతాయి.
కందుకూరు మెయిన్ బస్టాండు నుండి కావలికి 5 బస్సులు, ఆత్మకూరుకు 4 బస్సులు, కోవూరుకు 5 బస్సులు, నెల్లూరుకు 5, సర్వేపల్లికి 5, ఉదయగిరికి 5 బస్సులు బయలుదేరుతాయి.
ఆత్మకూరు మెయిన్ బస్టాండు నుంచి కావలికి 6 బస్సులు, కందుకూరుకు 8 బస్సులు, కోవూరుకు 6, నెల్లూరు 12, సర్వేపల్లికి 6, ఉదయగిరికి 6 బస్సులు బయలుదేరుతాయి.
ఉదయగిరి మెయిన్ బస్టాండు నుంచి కావలికి 8 బస్సులు, కందుకూరుకు 6 బస్సులు, కోవూరుకు 6, నెల్లూరుకు 11, సర్వేపల్లికి 5, ఆత్మకూరుకు 7 బస్సులు బయలుదేరుతాయి.
ఎన్నికల విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు, సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పోలింగ్ కేంద్రాకు చేరుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.