నెల్లూరు: నగర పాలకసంస్థ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీమతి హరిత సమీక్షించారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు గురించి చర్చించారు. మంచినీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్ అధికారులను సూచించారు. సమీక్షలో భాగంగా ఆర్ధిక సంఘం నిధుల పనుల అభివృద్ధి, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, మన బడి నాడు- నేడు, సాధారణ నిధుల అభివృద్ధి పనులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణ పనులు, నగర వ్యాప్తంగా పచ్చదనం ఏర్పాటు వంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులన్నీ వేగవంతంగా పూర్తయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటును అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు సంపత్ కుమార్, సంజయ్, చంద్రయ్య, శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.