అమరావతి: అరుణాచల్ ప్రదేశ్, భారత్లో భాగమేనని, తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది..అరుణాల్ను దక్షిణ టిబెట్గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా,, అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసింది..ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు.. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (LAC) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు..ఇటీవల ప్రధాని మోదీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు..దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది..జాంగ్నాన్ తమదే అని, సేలా సొరంగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిందంటూ చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ గత శుక్రవారం వ్యాఖ్యానించారు..దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టం చేసింది..ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.