AMARAVATHI

ఈనెల 14 వరకు ఓటు నమోదుకు అవకాశం- జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్

ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్..

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 14వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, అప్పటివరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 14 వరకు తమకు అందిన ఫామ్ 6, 6ఎ, 8 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదయి ఉన్నారన్నారు..జిల్లాలో 7971 ఫామ్ 6 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మే 13 పోలింగ్ రోజున ఓటరు జాబితాలో చిన్న చిన్న తప్పులు, ఫోటోలు సరిగా లేకపోయినా భారత ఎన్నికల సంఘం సూచించిన పది గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈ కళాశాలలోని చేపట్టనున్నట్లు చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

7 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

10 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

10 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

12 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.