HYDERABAD

చిల్లర నాటకలు కేసిఆర్ కు ఆలవాటే-రూ.400 కోట్లు ఎక్కడ-బండి సంజయ్

హైదరాబాద్: TRS పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియోలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో స్పందించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కు వచ్చిన వారు BJP నేతలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడి ఫాంహస్ వాళ్లదేనని, అలాగే, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లేనని చెప్పారు. డ్రామాలు ఆడడం TRSకు కొత్తేమీ కాదని, గతంలో ఓ మంత్రిపై హత్యాయత్నం జరిగిందని,అది కూడా నాటకమే అన్న విషయం బయటపడిందన్నారు.ఎమ్మెల్యేలను కొనేందుకు స్వామీజీలు వెళతారా? అంటూ నిలదీశారు. తెలంగాణ CM KCRకు హిందూ ధర్మం అంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.

కుట్రలు పన్ని తమపై బురద చల్లడానికే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన సంజయ్, TRSకు చెందిన ఆ నలుగురు MLAలను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా, వారిని ప్రగతిభవన్‌కు ఎలా రమ్మంటారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఎమ్మెల్యేలను 50 పైసలకు కూడా ఎవరూ కొనరంటూ ఎద్దేవా చేశారు.TRS ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంపై కేసిఆర్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని… బీజేపీపై అకారణంగా బురద చల్లేందుకు ప్రయత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

21 mins ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

4 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

4 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

4 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.