పోలింగ్ విధులు..
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే పి ఓ లు, ఏపీవోలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా పోలింగ్ విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాల, వి ఆర్ లా కళాశాలలో నిర్వహించిన పోలింగ్ అధికారుల శిక్షణా తరగతులను కలెక్టర్ పరిశీలించారు. డీకే డబ్ల్యూ కళాశాలలో శిక్షణా తరగతులను పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వి ఆర్ లా కళాశాలలో శిక్షణ అనంతరం పోలింగ్ అధికారులకు నిర్వహించిన పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. ప్రశ్నాపత్రంలోని పలు ప్రశ్నలను అడిగి ఏ మేరకు శిక్షణ పొందారో పరిశీలించారు. ఈవీఎం మిషన్ వాడకం పై పోలింగ్ సిబ్బందికి ఇస్తున్నశిక్షణను కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను నిర్వర్తించాలని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.కలెక్టర్ వెంట నెల్లూరు, నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారులు వికాస్, మలోల, ఏ ఆర్ ఓ జీవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.