AMARAVATHI

ఓటర్ డ్రాఫ్ట్ రోల్ జాబితా విడుదల చేసిన కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం- 117, ఓటర్ డ్రాఫ్ట్ రోల్ 2024 లిస్ట్ ను కమిషనర్ వికాస్ మర్మత్ సోమవారం విడుదల చేసారు. కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓటరు జాబితాను ప్రకటించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ విడుదల చేసిన ఓటరు జాబితాలను సంబంధిత అన్ని పోలింగ్ స్టేషన్లతో పాటు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. BLO.లు నిర్వహణలో ఇంటింటి విచారణ అనంతరం, అన్ని రకాల ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను రూపొందించామని తెలిపారు. వివిధ దరఖాస్తులు ద్వారా అందుకున్న 92500 ఓటర్ల సవరణలను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసామని తెలిపారు. నగర వ్యాప్తంగా చేపట్టిన ఓటరు అవగాహనా సదస్సులతో 58000 నూతన ఓటర్ల దరఖాస్తులు అందుకున్నామని, ముగ్గురు ఏ.ఈ.ఆర్.ఓ ల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అర్హులుగా గుర్తించిన వారందరికీ ఓటు హక్కు కల్పించామని తెలిపారు. కుటుంబ సభ్యులైన ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చేలా జాబితా రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. ప్రతీ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఓటరు జాబితా రూపకల్పన ప్రగతిని వివరిస్తూ వచ్చామని, అభ్యంతరాలను స్వీకరించి, ఎప్పటికప్పుడు జాబితాలో సవరణలు చేశామని కమిషనర్ వెల్లడించారు. ప్రకటించిన నూతన జాబితాను ఓటర్లందరూ పరిశీలించుకుని వివరాలను సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

21 mins ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 hour ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

4 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

5 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

24 hours ago

This website uses cookies.