బెంగళూరు-మైసూరు 6 లేన్స్ ఎక్స్ప్రెస్వే..
అమరావతి: కాంగ్రెస్ పార్టీ తనకు సమాధి నిర్మించాలని శతవిదాలు ప్రయత్నిస్తొందని,,అయితే తాను దేశంలో రోడ్లను నిర్మించే పనిలో ఉన్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో బెంగళూరు-మైసూరు మధ్య రూ.8,480 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచిన 118 కిలోమీటర్ల పొడవైన 6 లేన్స్ ఎక్స్ప్రెస్వేని ప్రధాని ప్రారంభించి సందర్బంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..మోదీకి సమాధి కట్టాలని వారనుకుంటున్నా, దేశంలోని తల్లులు, సోదరీమణులు, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా ఉన్నారని చెప్పారు..డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కర్ణాటక అభివృద్ధి మరింత వేగంగా జరుగుతొందని చెప్పారు..కాంగ్రెస్ పార్టీ 2014కు ముందు పేద ప్రజల ఆర్దిక పరిస్థితిని పతనం అంచులకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలు ఎదైనా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాలంటే కాళ్లరిగేలా కార్యాలయం చుట్టు తిరగాల్సి వచ్చేదని,, బీజేపీ హయాంలో నేరుగా ఇంటి వద్దకే పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు.. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు..అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన కర్ణాటకతో పాటు దేశమంతటా జరుతున్నయన్నారు.. మౌలిక సదుపాయాల కల్పనతో ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయని,,దింతో ప్రజల ఆదాయ కూడా పెరుగుతొందన్నారు..గత 9 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 2 కోట్లకు పైగా పేద ప్రజలకు ఇళ్లు కట్టించడం జరిగిందని,, ఒక్క కర్ణాటకలో లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు..జల్ జీవన్ మిషన్ కింద 40 లక్షల కుటుంబాలకు కుళాయి నీటిని అందించామన్నారు..చెరకు రైతులకు బడ్జెట్లో అనేక వెసులుబాట్లు కల్పించామని చెప్పారు..2013-14 నుంచి రూ.17, 000 కోట్ల ఇథనాల్ను చక్కెర కర్మాగాల నుంచి కొనుగోలు చేస్తామని,,ఈ సొమ్ము చెరకు పండించే రైతులకు చేరుతుందని అన్నారు..బయోటెక్నాలజీ నుంచి రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ నుంచి ఈవీల వరకూ కర్ణాటక ఈ కొత్త పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పారు..
(బెంగళూరు-మైసూరు మధ్య 6 లేన్స్ నిర్మాణంతో ప్రయాణ సమయం 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుంది.. మాండ్య,, హుబ్లి-ధార్వాడ్ జిల్లాలో రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా మోదీ ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.)
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.