DISTRICTS

పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తాం-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నెల్లూరు: పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని స్వదేశీ దర్శన్, ప్రసాద్-వారసత్వ ప్రదేశాల అభివృద్ధి అనే రెండు పథకాలు ఉన్నాయని వాటిలో ఏది వీలైతే అది వర్తించేలా కృషి చేస్తామని, ఆశ్రమ కమిటీ సభ్యులైన 12 మంది సభ్యులు ఇందుకోసం  కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తీర్మానం చేసి పంపాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.సోమవారం ఒక రోజు పర్యటన నిమిత్తం నెల్లూరుకు సింహపురి ట్రైయిన్ లో నెల్లూరుకు చేరుకున్న కేంద్ర మంత్రి,నగరంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు.తొలుత ప్రెస్ ఇన్పరేమేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన  జర్నలిస్టులకు:- కేంద్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న వివిధ పథకాలపై ఆవగాహన(వార్తలాప్) కార్యక్రమంలో పాల్గొని,జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

జయభారతీ:- ఆసుపత్రిలో నూతనం ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యలను పరిశీలించి,అక్కడ చికిత్స పొందుతూన్న రోగులకు పండ్లు అందచేశారు.ఆసుపత్రిలో సౌకర్యాలకు కృషిచేస్తున్న వారిని సత్కరించారు.

ఎమ్మేల్సీ:- టౌన్ హాల్ నిర్వహించిన ఎమ్మేల్సీ అభ్యర్దుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.దేశ వ్యాప్తంగా బీజెపీ కార్యకర్తల కృషితో నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజెపీ ప్రజా సంక్షేమ కార్యక్రమంలతో పాటు,దేశ అభివృద్దికి ప్రధాని మోదీ నాయకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

పల్లిపాడు :-గాంధీ ఆశ్రమంకు చేరుకున్న కేంద్ర మంత్రి పినాకీని ఆశ్రమంను పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి పొనకా కనకమ్మ విగ్రహానికి కూడా ఖద్దరు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంలో అయన మాట్లాడుతూ గాంధీ ఆశ్రమ కమిటీ సభ్యులు కోరిక మేరకు  కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఆశ్రమాన్ని తీసుకుంటే ఎటువంటి దురాక్రమణలు జరగకుండా కట్టడాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. అంతవరకు గాంధీ ఆశ్రమాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.ఆశ్రమాన్ని పరిరక్షించడంతో పాటు  నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం విద్యుత్ విద్యుద్దీకరణం వంటి ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందన్నారు.

నరసింహకొండ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను అన్ని విధాల అభివృద్ధి పరుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం రాత్రి నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ  పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

11 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

13 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

13 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

18 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.