అమరావతి: దేశ వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఛార్జీల విధానం అమలులోకి రానున్నాయి..కొత్త విధానంలో పగటిపూట విద్యుత్ ఛార్జీలు 20 శాతం వరకు తగ్గనుండగా,,రాత్రిపూట పీక్ ఆవర్స్ ల్లో విద్యుత్ ఛార్జీలను 20 శాతం మేర పెంచనున్నారు..ఇందుకు సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది..పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది..ఈ కొత్త విధానం అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్ పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలిపింది..2024 ఏప్రిల్ నుంచి తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ విధానం అమలులోకి వస్తుందని,,సంవత్సరం తరువాత వ్యవసాయ రంగం మినహా, మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ రూల్ ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది..సౌర విద్యుత్తు తక్కువ ధరకు వస్తుందని,, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే పగటి సమయాల్లో విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని, తద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు..సౌర శక్తి అందుబాటులో లేని రాత్రి సమయాల్లో థర్మల్, హైడ్రో, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు..సౌర విద్యుత్ ఉత్పత్తి కంటే వాటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని,,రాత్రి వేళ విద్యుత్ ఛార్జీలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.. 2030 నాటికి శిలజాయేతర ఇంధనాల శక్తి సామర్థాన్ని 65 శాతం చేర్చేందుకు ఈ విధానం సహాయ పడుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి పేర్కొన్నారు.. 2070 నాటికి సున్నా ఉద్గారాల లక్ష్యానికి అనుగుణంగా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.