సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది..
నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సూచించారు. సోమవారం అయన ఎన్నికల కమాండ్ కంట్రోల్ సెంటర్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, కేంద్ర పరిశీలకులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిశ్రా మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగిస్తూ ఎన్నికల నిర్వహణ చేస్తున్నందుకు జిల్లా యంత్రంగాన్ని ఆయన అభినందించారు. సీజింగ్ ల్లో పట్టుబడిన నగదు వస్తువుల విషయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పోలీస్ బలగాల సరిపోతాయా ఇంకా అవసరం ఉందా ఎస్పీ ని కోరగా ఇతర రాష్ట్రాల నుండి పోలీసు బలగాలను తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
కమాండ్ కంట్రోల్ చేరుకున్న ప్రత్యేక అబ్జర్వర్ ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి కంప్లైంట్ సెల్ ,సోషల్ మీడియా ,సి విజిల్ వాహనాల జిపిఎస్, చెక్ పోస్ట్ లో తనిఖీలు తదితర అంశాలను కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ ఎన్నికల ప్రత్యేక జనరల్ పరిశీలకులకు వివరించారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది:- నేటితో నామినేషన్లు వేసిన కొంత మంది అభ్యర్దులు విత్ డ్రా చేసుకున్నారు.నెల్లూరు సీటి నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది అభ్యర్దులు నామినేషన్ దాఖలు చేయగా అందులో 8 మందికి సంబంధించి నామినేషన్లు రిజెక్ట్ అయ్యయి..మరో 3 అభ్యర్దులు విత్ డ్రా చేసుకున్నారు..బరిలో ఇండిపెండెట్స్ తో కలుపుకుని 15 మంది అభ్యర్దులు రంగంలో వున్నారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.