అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.. కాల్పుల్లో చనిపోయిన 7 మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.. పలువురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. సంఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది..దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి.. సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి, మంగళవారం ఉదయం మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు..పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు..బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు..సంబంధిత ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.