AMARAVATHI

నేపాల్ లో భూకంపం 128 మంది మృతి,140కి పైగా గాయాలు,ఆస్తి నష్టం?

అమరావతి: నేపాల్ లో శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది.. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 128 మంది మరణించారు..భూకంపం వల్ల 140 మందికి పైగా గాయపడ్డారు..వీరి సంఖ్య ఇంక పెరిగి అవకాశం వుంది..
భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైందని అధికారులు తెలిపారు..జాజర్ కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూమికి 18 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనల కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది.. భూకంప కేంద్రానికి 676 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని న్యూఢిల్లీ,,బీహర్,,యూపీలో వరకు భూ ప్రకంపనలు సంభవించాయి..
నేపాల్ లో తరుచూ భూకంపలు ఎందుకు ? :- నేపాల్ దేశంలోని భూమి క్రింద ఒక ప్రధాన భౌగోళిక లోపం ఉంది.. భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది..దీని కారణంగా భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా జరుగుతుంది..
2015వ సంవత్సరంలో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 12000 వేల మందికి పైగా మరణించగా,,10 లక్షల ఇళ్లు,,భవనాలు దెబ్బతిన్నాయి..2023 అక్టోబర్ 3వ తేదీన 6.2 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనల కాణంగా 334 ఇళ్లు ధ్వసం కాగా 1,115 మంది గాయపడ్డారు..ఈ ప్రకంపనలు Delhi-NCR ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించాయి..2022 నవంబరులో నేపాల్ లోని దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు..
భూకంప మృతులకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం తెలిపారు.. క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు,, సహాయ కార్యక్రమాలు వేగంగా చేపట్టేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ కార్యాలయం తెలిపింది.. భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించింది..భూకంపం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని నేపాల్ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

3 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

20 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

23 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.