AMARAVATHI

పాకిస్థాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి,పలు యుద్ద విమానలు అగ్నికి అహుతి

అమరావతి: పాకిస్థాన్ లోని పంజాబ్ పరిధిలో వున్న మియాన్ వాలి ఎయిర్ బేస్ పై శనివారం వేకువజామున ఉగ్రవాదులు దాడి చేశారు.. ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పపడ్డారు.. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) అధికారులు వెల్లడించారు..6 మందితో కూడిన ఉగ్రవాదుల బృందం, భారీ ఆయుధాలతో వేకువజామున పాకిస్థాన్ వైమానిక స్థావరంపై దాడి చేసిందని వెల్లడించింది..పాక్ సైన్యం వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపిందని,,ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని, మిగతా వారిని బంధించినట్లుగా పేర్కొంది.. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపు తాము దాడిని విఫలం చేశామని పాకిస్థాన్ తెలిపింది..ఈ ఘటనలో చాలా వరకు చిన్న, పెద్ద యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తొంది..ఈ దాడి తమ పనేనని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్(TJP) ప్రకటించింది..
పాకిస్థాన్ ఆర్మీ:- ఈ దాడిలో ఎయిర్ బేస్ పై నిలిపి ఉంచిన 3 విమానాలు దెబ్బతిన్నాయని,,ఇంధన బౌజర్ కూడా ధ్వంసమైందని పాక్ సైన్యం వెల్లడించింది.. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలో తీసుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చివరి దశలో ఉందని పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వెల్లడించింది.. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. శుక్రవారం పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు..ఈ దాడిలో 5 మంది మరణించగా ఇందులో 2 పోలీసులు ఉన్నారు.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలెట్లు, వైమానిక దళ సభ్యులు కూడా మృతిచెందినట్లు కొన్ని వార్తల సంస్థలు తెలియచేస్తున్నాయి..

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

17 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

18 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

19 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

21 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

22 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.