AMARAVATHI

దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో మాగుంట,కవితలపై గురి పెట్టిన ఈడీ

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది..ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ,,దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది.(దిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు)లో ఈడీ సోదాలు చేస్తోంది..దిల్లీ మద్యం కుభకోణంలో,,TRS MLC కేసీఆర్ కుమారై కవిత,,YSRCP MPఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిల పైనా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది..ఈడీ బృందాలు తెలంగాణ, చెన్నై, నెల్లూరు, దిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో 25 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు..ఇంతకు ముందు ఈడీ హైదరాబాద్‌లో సోదాలు చేసింది.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది..సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్​లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా,, సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది.. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్​లో డైరెక్టర్​గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్​గా ఉన్నారు.. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది..అలాగే కోకాపేట్​లోని రామచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు చేశారు..పలువురి రాజకీయ ప్రముఖులతో రామచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించారు..

నెల్లూరు:- నగరంలోని రాయాజీ వీధిలోని ఎం.పీ మాగుంట.శ్రీనివాసులరెడ్డి నివాసంలోను, ఆఫీసుల్లో,,అలాగే బుచ్చిరెడ్డిపాళెం,రేబాలలో నివాసం వుంటున్న మాగుంట బంధువు అయిన ఏటూరు.శివరామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.. ఇంట్లోను తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత:- మద్యం స్కామ్‌ కేసులో కవిత మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది..శుక్రవారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది..అలాగే కవితకు ఈడీ నోటీసులు పంపించింది..ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది..హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది..

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 hour ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 hour ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

19 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.