నెల్లూరు: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని మౌలిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో GGH అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా GGHని అభివృద్ధి చేయాలన్నారు.ఆసుపత్రి అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. GGHలో కానుపుల సంఖ్య, స్కానింగ్, సర్జరీలను ఇంప్రూవ్ చేయడంతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.ఆసుపత్రి పరిధిలో అందించే వైద్య సేవలన్నింటీని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలో ఎక్యూప్మెంట్ కు చేపట్టాల్సిన మరమ్మత్తులకు సంబంధించి మంజూరు చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఖాళీగా వున్న డాక్టర్, సిబ్బంది పోస్టులను త్వరగా భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలనన్నారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్ డా.శిద్దా నాయక్, APMSIDC EE విజయభాస్కర్, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కో ఆర్డినేటర్ శ్రీమతి సునంద, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సభ్యులు అభిషేక్ రెడ్డి, వెంకటేశ్వర్లు, GGHకు సంబంధించిన వివిధ విభాగాల H.O.Dలు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.