గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ ఆవరణంలోని గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా జిల్లా చక్రధర్ బాబు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు అనుసరణీయమని, జాతి వున్నత కాలం వారి జ్ఞాపకాలు మనకుంటాయన్నారు. అహింసా సిద్దాంతంతో దేశ స్వాతంత్ర్య పోరాటం నడిపించి స్వాతంత్య్రాన్ని సాధించి ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా నిలిచారని, అలాంటి మహనీయులను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గాంధీజీ తోపాటు ఎంతో మంది స్వాతంత్ర్య సమరంలో తమ జీవితాలను త్యాగం చేశారని, అలాంటి మహనీయులను ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, డ్వామా పి.డి వెంకట్రావు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి షఫి మాలిక్, కలెక్టరేట్ ఆవరణంలోని వివిద కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
This website uses cookies.