DISTRICTS

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి-చక్రధర్ బాబు

గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్  ఆవరణంలోని గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా జిల్లా చక్రధర్ బాబు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు అనుసరణీయమని, జాతి వున్నత కాలం వారి జ్ఞాపకాలు మనకుంటాయన్నారు. అహింసా సిద్దాంతంతో దేశ స్వాతంత్ర్య పోరాటం నడిపించి స్వాతంత్య్రాన్ని సాధించి ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా నిలిచారని, అలాంటి మహనీయులను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  గాంధీజీ తోపాటు ఎంతో మంది స్వాతంత్ర్య సమరంలో తమ జీవితాలను త్యాగం చేశారని, అలాంటి మహనీయులను  ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, డ్వామా పి.డి వెంకట్రావు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి షఫి మాలిక్, కలెక్టరేట్ ఆవరణంలోని వివిద కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *