AMARAVATHI

బెంగళూరు సిటీలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు-ఐదుగురికి గాయాలు

అమరావతి: బెంగళూరు నగరంలోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యహ్నం 2 గంటల సమయంలో పేలుడు సంభవించింది..పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ దెబ్బతినగా,5కి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీయడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది..సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..గ్యాస్ సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఐడీ కార్డులు,,పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో బ్యాటరీని గుర్తించారు..అలాగే, కేఫ్‌లో ఓ కస్టమర్ బ్యాగ్ కాలిపోయి కనిపించింది.. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..సంఘటన స్థలంకు  ఏసీపీ రీనా సువర్ణ, మారతహళ్లి పోలీసులు చేరుకుని కాలిపోయిన బ్యాగును, ఐడీ కార్డును పరిశీలించారు.. కేఫ్ లోని సీసీటీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు..అలాగే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు..

 

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

13 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

14 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

15 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

16 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.