AMARAVATHI

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు-జనసేన

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది…పవన్ పై కుట్ర పూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోన్న వారిలో ప్రధానంగా వైసీపీ (YCP)కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని తెలిపింది..వారితో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెళ్లు, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని పేర్కొంది..తప్పుడు ప్రచారం చేస్తోన్న పలు అకౌంట్ల వివరాలు కూడా జనసేన తెలియచేసింది..అలాగే పవన్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయానికి జనసేన వీర మహిళలు ర్యాలీగా వెళ్లెందుకు ప్రయత్నించారు..దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంద…డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డంపెట్టారని వీర మహిళలు ఆరోపించారు..ఏపీలో మహిళలకు భద్రత లేదంటూ నినాదాలు చేశారు.. పవన్ కల్యాణ్ తన మూడో భార్యతోనూ విడిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు విపరీతంగా వస్తున్నాయని,, వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను దెబ్బ తీసేందుకే ఇటువంటి పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

12 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

17 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.