పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు-జనసేన
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది…పవన్ పై కుట్ర పూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోన్న వారిలో ప్రధానంగా వైసీపీ (YCP)కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని తెలిపింది..వారితో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెళ్లు, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని పేర్కొంది..తప్పుడు ప్రచారం చేస్తోన్న పలు అకౌంట్ల వివరాలు కూడా జనసేన తెలియచేసింది..అలాగే పవన్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయానికి జనసేన వీర మహిళలు ర్యాలీగా వెళ్లెందుకు ప్రయత్నించారు..దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంద…డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమను ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డంపెట్టారని వీర మహిళలు ఆరోపించారు..ఏపీలో మహిళలకు భద్రత లేదంటూ నినాదాలు చేశారు.. పవన్ కల్యాణ్ తన మూడో భార్యతోనూ విడిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు విపరీతంగా వస్తున్నాయని,, వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను దెబ్బ తీసేందుకే ఇటువంటి పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అసభ్య వ్యాఖ్యలపై జనసేన వీర మహిళ విభాగం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి అసభ్య ట్వీట్స్ వేస్తున్న వ్యక్తులపై ఏపీ డీజీపీ చర్యలు… https://t.co/W6PH0K3GKv
— JanaSena VeeraMahila (@JSPVeeraMahila) July 7, 2023