అమరావతి: కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగనున్న సమయంలో కన్నడ సినీ నటుడి కిచ్చా సుదీప్ కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతోకలిసి బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నసందర్బంలో సుదీప్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.. బొమ్మైతో తనకున్న అనుబంధంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడానికే వచ్చానన్నారు.. బీజేపీ సిద్ధాంతం తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ నటుడు కిచ్చా సుదీప్ మద్దతు తమకు కలిసి వస్తుందని,,పూర్తి మెజార్టీతో తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు, బీజేపీకి మద్దతిచ్చిన కిచ్చా సుదీప్కు ధన్యవాదాలు తెలిపారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.